Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ తిరుపతి వస్తున్నారు.. మీ కార్లు జాగ్రత్త అంటూ దండోరా వేసిన జనసేన

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:38 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర పరువు గంగలో కలిసిపోతుంది. జగన్ రెడ్డి వైఖరికి తోటు అధికారుల అత్యుత్సాహం, అతి చేష్టలు రాష్ట్రం పరువును మరింతగా దిగజార్చుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఒంగోలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళుతున్న భక్తుల కారును ఆపి ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైగా, భక్తులు బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీవో అధికారులు ట్రావెల్ కారును స్వాధీనం చేసుకున్నవార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే, ఈ నెలలో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ తిరుపతి విభాగం నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నారని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 
 
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments