Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ తిరుపతి వస్తున్నారు.. మీ కార్లు జాగ్రత్త అంటూ దండోరా వేసిన జనసేన

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:38 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర పరువు గంగలో కలిసిపోతుంది. జగన్ రెడ్డి వైఖరికి తోటు అధికారుల అత్యుత్సాహం, అతి చేష్టలు రాష్ట్రం పరువును మరింతగా దిగజార్చుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఒంగోలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళుతున్న భక్తుల కారును ఆపి ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైగా, భక్తులు బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీవో అధికారులు ట్రావెల్ కారును స్వాధీనం చేసుకున్నవార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే, ఈ నెలలో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ తిరుపతి విభాగం నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నారని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 
 
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments