Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ అంటే వ్యక్తిగతంగా ఇష్టం.. నా వెంట ప్రజలున్నారు.. బీజేపీ కాదంటున్న హీరో (Video)

తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని చెప్పారు.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (17:16 IST)
తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని చెప్పారు. 
 
ఆయన మంగళవారం ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బాగా బలహీనపడిందన్నారు. పైగా, తాను జనం కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నానని, జనం సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. 
 
తనకు సినిమాల్లో నటించడం కంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే అమితానందం లభిస్తుందన్నారు. అందువల్ల ప్రజల కోసం, ప్రజా సమస్యలపై తాను పోరాడతానని అన్నారు. పైగా, తన వెంట బీజేపీ లేదా వైకాపా లేదని, కేవలం ప్రజలు మాత్రమే ఉన్నారనీ, వారికోసమే తాను మాట్లాడుతున్నట్టు పవన్ చెప్పారు. 
 
కాగా, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్‌పై టీడీపీ నేతలు ముప్పేట విమర్శల దాడిచేస్తున్న విషయం తెల్సిందే. బీజేపీ డ్రామాలో భాగంగానే పవన్.. టీడీపీ నేతలపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడుతున్నారు. బీజేపీతో పవన్ ములాఖత్ అయ్యారని, వైసీపీ, బీజేపీ, పవన్ ముగ్గురూ కుమ్మక్కై టీడీపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments