Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కరణ కేసులో సబ్ కలెక్టరుకు ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోర్టు తీర్పును యధేచ్చగా ధిక్కరిస్తున్నారు. అలాంటి వారికి ధర్మాసనం జైలుశిక్షలను విధిస్తుంది. ఇటీవల ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత వారు ప్రాధేయపడటంతో వారు యేడాదిపాటు సంఘ సేవ చేయాలంటూ ఆదేశించింది. 
 
తాజాగా ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో వారికి ఒక ఆర్నెల్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీరిలో రాజంపేట సబ్‌కలెక్టర్ ఖేతన్ గర్గ్, ఏపీఎండీసీ సీపీఓ సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఆరు నెలల జైలుతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ఓబులావారి పల్లె మండలం మంగంపేటలో 2003లో జరిగిన మైనింగ్ కారణంగా గ్రామానికి చెందిన నరసమ్మ తన ఇంటిని కోల్పోయింది. పరిహారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించగా ఆమెకు చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ కేసును విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ ఆమెకు మాత్రం పరిహారం అందలేదు.దీంతో ఆమె మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు ధిక్కరణ చర్యల కింద ఇద్దరు అధికారులకు ఆర్నెల్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments