Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కొనివ్వలేదని యాసిడ్ తాగిన యువకుడు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన ఓ యువకుడు ద్రావకం సేవించాడు. తల్లిదండ్రులు తాను కోరిన కారును కొనివ్వలేదన్న కోపంతో యాసిడ్ సేవించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, కోరుట్ల మండలం, కల్లూరులో సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సీపెల్లి భానుప్రకాష్ (22) గత కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వచ్చాడు. 
 
గత పక్షం రోజులుగా మరింత ఒత్తిడి చేయసాగాడు. అయితే, అతని మాటలను తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి యాసిడ్ సేవించాడు. ఆ తర్వాత మంటలు తాళలేక కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్‌న ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాష్ చేయి కోసుకున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments