Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్న జగన్....

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముందు నుంచే హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా నవరత్నా

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (15:26 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముందు నుంచే హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా నవరత్నాలు గుప్పించారు జగన్. నవరత్న హామీలపై ప్రజల్లో ఆలోచన కూడా మొదలైంది. రైతులకు ప్రతి యేడాది మే నెలలో 12 వేల రూపాయలు రైతన్న భరోసా ఇవ్వడంతో పాటు రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి.
 
ఈ హామీలన్నీ నెరవేర్చడం సాధ్యమవుతాయో లేదో తెలియదు కానీ వాటిని చేసి చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మాటలు చెప్పి మోసగించడం నాకు తెలియదు. ఏదైనా చేతల్లో చూపించే సత్తా నాకుంది. నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతమాత్రం నిజం కాదు. నవరత్నాలను అమలు చేస్తూ వాటిని మించిన పథకాలను ప్రవేశపెట్టి ప్రజాభివృద్థికి పనిచేసి తీరుతానంటూ జగన్ పాదయాత్రలో హామీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments