Jagan: అది ఇస్తారా.. నేను అసెంబ్లీకి వస్తాను.. కండిషన్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 30 వరకు జరగనున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవు ఉండనుంది. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను తెదేపా, 9 అంశాలను భాజపా ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్‌లోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 
వైసీపీ శాసనససభా పక్ష భేటీలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఎమ్మెల్యేలతో చెప్పారు. కానీ ఆయన అసెంబ్లీకి రావాలంటే ఓ కండిషన్ పెట్టారు. సభలో తగినంత టైమ్‌ ఇస్తే రేపటి నుంచే సభకు వస్తానని చెప్పారు. 
 
ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు కొన్ని నిమిషాలు ఇస్తే తాను ఏం మాట్లాడాలని వైఎస్ జగన్ అన్నారు. ప్రజా సమస్యలు వివరంగా చెప్పాలంటే టైమ్ ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని అడిగారు. వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకి వెళ్లి ఈ విషయాన్ని చెప్పమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments