Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై దాడి.. గవర్నర్ ఫోన్.. రోజా ఫైర్.. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటి?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:48 IST)
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై దాడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాజకీయంగా అణచివేసేందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. ఈ కుట్ర వెనకాల ఉన్నవాళ్లెవరో బయటకు రావాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.
 
ఎయిర్ పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్ కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై హత్యకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించిన రోజా.. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌పై చిన్న చాకుతో దాడి చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయని... ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే, దాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారా? అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments