Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అబద్ధాల కోరు.. ప్రధాని సార్ జోక్యం చేసుకోండి.. జగన్

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (11:12 IST)
ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడును "అబద్ధాలకోరు"గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని.. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మందలించాలని కోరారు. 
 
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా సీఎం నాయుడు దిగజారిపోయారని ప్రధాని మోదీకి రాసిన ఎనిమిది పేజీల లేఖలో జగన్ ఆరోపించారు. నెయ్యి స్వీకరించడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం (టిటిడి)లో చేపట్టిన ప్రక్రియను వివరిస్తూ, సీఎం స్థాయిని మాత్రమే కాకుండా, ప్రజా జీవితంలోని ప్రతి ఒక్కరిని, టిటిడి పవిత్రతను చంద్రబాబు దిగజార్చారని పైర్ అయ్యారు. 
 
ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని.. తిరుమల పవిత్రతను కూడా రాజకీయాల కోసం ఉపయోగిస్తున్న చంద్రబాబును మందలించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 
 
టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో కోరిన జగన్, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయకపోతే చాలా తీవ్రమైన, విస్తృత పరిణామాలుంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అందరూ గర్వపడేలా కష్టపడతా : నటి జాన్వీ క‌పూర్

మ్యూజిక్ డైరెక్టర్స్ కు సవాల్ విసిరిన శారీ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

దేవర ప్రీరిలీజ్ వాయిదా పడటంపై ఎన్.టి.ఆర్. ఎమోషనల్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు... ఎందుకో తెలుసా?

'దేవర' చిత్ర నిర్మాతలకు దసరా బొనంజా.. రూ.60 టిక్కెట్ రూ.135కు పెంపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments