Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మార్చే హక్కు జగన్‌కి లేదు: సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:36 IST)
బీసీజీ కమిటీపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ రిపోర్ట్‌లో బీసీజీ సభ్యుల సంతకాలు మాత్రమే ఉంటాయని, సీఎం జగన్ చెప్తే ఎంపీ విజయసాయిరెడ్డి రిపోర్ట్ రాశారని ఆరోపించారు. రాజధాని మార్చే రాజకీయ హక్కు జగన్‌కి లేదని చెప్పారు.

ప్రభుత్వం సమాధులు సిద్ధం చేసింది.. రైతులకా? ప్రభుత్వానికా త్వరలో తెలుస్తుందని నారాయణ హెచ్చరించారు. అసెంబ్లీ, సచివాలయం ఒక దగ్గరే ఉండాలని, మొగుడు ఒక చోట.. పెళ్ళాం ఒక చోట ఉండొద్దని సూచించారు.

ఇక నుంచి ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకెళ్లాల్సిందేనని, పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. మందడంలో మహిళలపై దాడులు దారుణం పోలీసులా.. డెకాయిట్లా అని నారాయణ నిలదీశారు.
 
రాజధాని అమరావతిపై బీసీజీ తుది నివేదికను జగన్‌ మోహన్‌రెడ్డికి అందజేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేశారు. రాజధాని, అభివృద్ధిపై సీఎంకు బీసీజీ ప్రతినిధుల నివేదిక అందించారు.

రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్‌ చర్చించనున్నది. హైపవర్‌ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. ఈ కమిటీ 3 వారాల్లో తన తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments