Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ చేనేత దినోత్సవం: ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

Jagan
Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (08:43 IST)
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీలో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే 'నేతన్న నేస్తం' మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 10న ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు(ఒక్కొక్కరికి) రూ.24 వేలు ఇస్తారు. వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు. 
 
పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.
 
నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. 
 
దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments