కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు...

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (13:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. అనేక ప్రాంతాల్లో వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ పనికి పాల్పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం మేరకు కాలిపోయింది. 
 
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్‌ను వైకాపా శ్రేణులు ఏర్పాటు చేశారు. కటౌన్‌ను దగ్ధం చేయడంపై వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
మరోవైపు, ఈ కటౌట్ దగ్ధం వార్త తెలుసుకున్న బందరు డీఎస్పీ బాషా, పెడన సీఐ ప్రసన్న గౌడ, గూడూరు ఎస్ఐ వెంకట్ ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా జగన్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆర్థిక సంఘం డైరెక్టర్ కారుమంచి కామేశ్వర రావు మాట్లాడుతూ, జగన్ కటౌట్‌ను కాల్చివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాల్లో అనేక కొడవలు ఉంటాయని, కానీ కటౌట్లకు నిప్పు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments