Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు...

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (13:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. అనేక ప్రాంతాల్లో వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ పనికి పాల్పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం మేరకు కాలిపోయింది. 
 
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్‌ను వైకాపా శ్రేణులు ఏర్పాటు చేశారు. కటౌన్‌ను దగ్ధం చేయడంపై వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
మరోవైపు, ఈ కటౌట్ దగ్ధం వార్త తెలుసుకున్న బందరు డీఎస్పీ బాషా, పెడన సీఐ ప్రసన్న గౌడ, గూడూరు ఎస్ఐ వెంకట్ ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా జగన్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆర్థిక సంఘం డైరెక్టర్ కారుమంచి కామేశ్వర రావు మాట్లాడుతూ, జగన్ కటౌట్‌ను కాల్చివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాల్లో అనేక కొడవలు ఉంటాయని, కానీ కటౌట్లకు నిప్పు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments