Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూవివాదంలో ఏపీ మంత్రి భార్య - 180 ఎకరాలు సీజ్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయారం సతీమణి రేణుకమ్మ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు చెందిన 180 ఎకరాల భూమిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ భూములకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ 180 ఎకరాల భూములను మంత్రి భార్య, బంధువుల పేరుమీద రిజిస్టర్ అయివుందని, ఈ భూలాదేవీలకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఇవ్వాలని మంత్రి భార్యకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీ మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మకు కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.38 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఈ నోటీసులు జారీచేసింది. మొత్తం రూ.52.42 లక్షల విలువైన భూమి కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది.
 
ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు రిజిస్టర్ అయివుంది. మిగిలిన భూమి రిజిస్టర్ అయిన వాళ్లు మంత్రి బినామీలేనని, నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే ఈ 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు తెలిపారు. 90 రోజుల్లోగా ఈ కొనుగోళ్ళకు సంబంధించిన ఆదాయ వనరుల వివరాలను అందజేయాలని ఐటీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments