Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూవివాదంలో ఏపీ మంత్రి భార్య - 180 ఎకరాలు సీజ్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయారం సతీమణి రేణుకమ్మ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు చెందిన 180 ఎకరాల భూమిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ భూములకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ 180 ఎకరాల భూములను మంత్రి భార్య, బంధువుల పేరుమీద రిజిస్టర్ అయివుందని, ఈ భూలాదేవీలకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఇవ్వాలని మంత్రి భార్యకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీ మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మకు కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.38 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఈ నోటీసులు జారీచేసింది. మొత్తం రూ.52.42 లక్షల విలువైన భూమి కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది.
 
ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు రిజిస్టర్ అయివుంది. మిగిలిన భూమి రిజిస్టర్ అయిన వాళ్లు మంత్రి బినామీలేనని, నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే ఈ 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు తెలిపారు. 90 రోజుల్లోగా ఈ కొనుగోళ్ళకు సంబంధించిన ఆదాయ వనరుల వివరాలను అందజేయాలని ఐటీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments