Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూవివాదంలో ఏపీ మంత్రి భార్య - 180 ఎకరాలు సీజ్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయారం సతీమణి రేణుకమ్మ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు చెందిన 180 ఎకరాల భూమిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ భూములకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ 180 ఎకరాల భూములను మంత్రి భార్య, బంధువుల పేరుమీద రిజిస్టర్ అయివుందని, ఈ భూలాదేవీలకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఇవ్వాలని మంత్రి భార్యకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీ మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మకు కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.38 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఈ నోటీసులు జారీచేసింది. మొత్తం రూ.52.42 లక్షల విలువైన భూమి కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది.
 
ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు రిజిస్టర్ అయివుంది. మిగిలిన భూమి రిజిస్టర్ అయిన వాళ్లు మంత్రి బినామీలేనని, నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే ఈ 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు తెలిపారు. 90 రోజుల్లోగా ఈ కొనుగోళ్ళకు సంబంధించిన ఆదాయ వనరుల వివరాలను అందజేయాలని ఐటీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments