అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయం: కాలవ శ్రీనివాసులు

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:39 IST)
రాష్ట్రంలో అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమని మాజీ మంత్రి, టి.డి.పి పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేసే కమిటీల్లో జర్నలిస్టు సంఘాల  భాగస్వామ్యం దశాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే వారి ప్రాతినిధ్యం లేకుండా కేవలం అధికారులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ మంగళవారం 123 వ నెంబర్ జి.ఓ ను జారీ చేయడం పాత్రికేయుల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.

స్వయంగా ఓ మీడియా సంస్థ అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం పూర్వాశ్రమoలో జర్నలిస్టుగా పని చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి పర్యవేక్షణలో పాత్రికేయులపై పగబట్టినట్లు వ్యవహరిస్తుండడం దారుణమని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడి హయాంలో అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యాన్ని  ఒకటి నుంచి అయిదుకు పెంచామన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల్లేని అక్రిడేషన్ కమిటీల్లో పాత్రికేయుల స్థితిగతులను ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.

జర్నలిస్టుల ప్రయోజనాలను దెబ్బ తీసే జి.ఓ 123 ను తక్షణం ఉపసంహరించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పాత కమిటీల జర్నలిస్టుల ప్రాతినిధ్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments