Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వరూపానందస్వామికి బ్లాక్‌మెయిల్‌ చేయడం అలవాటే: శ్రీనివాసానంద సంచలన ఆరోపణలు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (11:21 IST)
శారదా పీఠాధిపతి స్వరూపానందపై ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఓ తెలుగు ఛానల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. తీవ్ర విమర్శలు చేశారు.

ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేయడం స్వరూపానందస్వామికి అలవాటేనని ఆరోపించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరిగినా స్వరూపానందస్వామి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

తిరుమలలో స్వరూపానంద పీఠం పెట్టుకుని ఏం దైవకార్యాలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. తిరుమలలో పీఠాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని శ్రీనివాసానంద ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు దేవాలయ భూములు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇతర ప్రార్థనామందిరాలకు మాత్రం స్థలాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments