ఆ నేత గాజు గ్లాస్‌ను కింద పడేసి ఫ్యాన్ గాలి కింద సేద తీరేందుకు సిద్ధమవుతున్నారా?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (21:37 IST)
గాజు గ్లాస్‌ను కింద పడేసి ఫ్యాన్ గాలి కింద సేద తీరడం అంటే ఇప్పటికే అర్థమై పోయుంటుంది. గాజు అంటే జనసేన, ఫ్యాన్ అంటే వైసిపి. ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ వైసిపిలో చేరుతారు అంటూ మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటివి చెలరేగడం వాటిని నాదెండ్ల ఖండించడం తెలిసిందే. ఐతే ఇప్పుడు మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
 
నాదెండ్ల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వైసిపిలో వెళ్ళాలని ఒత్తిడి తెస్తున్నారట. స్పీకర్‌గా పనిచేసిన అనుభవం నాదెండ్ల మనోహర్ ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్‌కు ఎంతో గుర్తింపు ఉండేది. ప్రస్తుతం వైసిపిలో ఉన్న ముఖ్య నేతలందరూ నాదెండ్ల మనోహర్‌కు అత్యంత సన్నిహితులే. మనోహర్ జనసేనలో ఉండటం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే మనోహర్‌ను వచ్చేయమని కోరుతున్నారట.
 
ఆగస్టు 7వ తేదీన గంటా శ్రీనివాస్ వైసిపిలో చేరుతున్నారనీ, అటు తరువాత నాదెండ్ల కూడా తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం తెలియదట. మరి ఈ వార్త కూడా ఎప్పటిలాగే గాలి వార్తో లేదంటే నిజమో తెలియాలంటే నాదెండ్ల మనోహర్ స్వయంగా చెప్పాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments