Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నేత గాజు గ్లాస్‌ను కింద పడేసి ఫ్యాన్ గాలి కింద సేద తీరేందుకు సిద్ధమవుతున్నారా?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (21:37 IST)
గాజు గ్లాస్‌ను కింద పడేసి ఫ్యాన్ గాలి కింద సేద తీరడం అంటే ఇప్పటికే అర్థమై పోయుంటుంది. గాజు అంటే జనసేన, ఫ్యాన్ అంటే వైసిపి. ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ వైసిపిలో చేరుతారు అంటూ మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటివి చెలరేగడం వాటిని నాదెండ్ల ఖండించడం తెలిసిందే. ఐతే ఇప్పుడు మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
 
నాదెండ్ల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వైసిపిలో వెళ్ళాలని ఒత్తిడి తెస్తున్నారట. స్పీకర్‌గా పనిచేసిన అనుభవం నాదెండ్ల మనోహర్ ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్‌కు ఎంతో గుర్తింపు ఉండేది. ప్రస్తుతం వైసిపిలో ఉన్న ముఖ్య నేతలందరూ నాదెండ్ల మనోహర్‌కు అత్యంత సన్నిహితులే. మనోహర్ జనసేనలో ఉండటం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే మనోహర్‌ను వచ్చేయమని కోరుతున్నారట.
 
ఆగస్టు 7వ తేదీన గంటా శ్రీనివాస్ వైసిపిలో చేరుతున్నారనీ, అటు తరువాత నాదెండ్ల కూడా తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం తెలియదట. మరి ఈ వార్త కూడా ఎప్పటిలాగే గాలి వార్తో లేదంటే నిజమో తెలియాలంటే నాదెండ్ల మనోహర్ స్వయంగా చెప్పాల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments