Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయవారధిగా మారుతున్న గరుడ వారధి..?

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:52 IST)
తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న గరుడ వారధి పనులు కాస్త రాజకీయవారధిగా మారిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పేరును మార్చేందుకు అధికార పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఏకంగా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు.
 
అసలు ఉన్నట్లుండి గరుడ వారధి పేరును ఎందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ సభ్యుడు బహిష్కరించాడు. దీంతో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఆ పేరు మార్పును ఆమోదించేశారు.
 
గరుడ పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనంగా గరుత్మంతుడు. ఆ పేరు మీద వారధి నిర్మిస్తుంటే ఎలా ప్రభుత్వం  మారుస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాలు.
 
కక్షపూరితంగా వ్యవహరిస్తూ టిడిపి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు పేరు మార్చే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం కచ్చితంగా పేరు మార్చాలని నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద గరుడ వారధి కాస్త రాజకీయ వారధిగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments