Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులపై సీఎం జగన్ ఫిర్యాదు... ఇంకేంటి విషయాలంటూ ప్రధాని దాటవేత!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (10:02 IST)
ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏకంగా 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా కోర్టులపై ఫిర్యాదు అంశంతో పాటు.. రాష్ట్రానికి నిధుల ఇవ్వండంటూ సీఎం జగన్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. 
 
హస్తిలో జరిగిన ఈ భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు... విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కోర్టు తనను పని చేసుకోనివ్వడంలేదంటూ సీఎం జగన్‌ న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని సమస్యలు వివరిస్తుండగా... కొద్దిసేపు ప్రధాని నరేంద్ర మోడీ చిరునవ్వుతో ఆలకించారు. 
 
ఆ తర్వాత, సీఎం మాటలను అడ్డుకుని, 'ఇవన్నీ అమిత్‌ షాకు ఇప్పటికే చెప్పారు కదా! ఇంకేంటి విశేషాలు' అని అడిగినట్లు తెలిసింది. దీంతో, 17 అంశాలతో గతంలోనే సమర్పించిన ఒక వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో ఆయనతో జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలపై ఈ భేటీలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments