Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ఉద్ధవ్ థాక్రే ఫోన్- బీజేపీతో కటీఫ్ చేస్కోండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్ర

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (14:29 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబు, థాక్రేల మధ్య ఫోన్ సంభాషణ సుమారు అరగంట పాటు నడిచిందని సమాచారం. 
 
ఈ సందర్భంగా బాబుతో ఉద్ధవ్ థాక్రే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  బీజేపీతో కటీఫ్ కావాలనుకుంటున్న బాబుకు ఉద్ధవ్ థాక్రే మాటలు మరింత బలాన్నిచ్చాయని సమాచారం. అంతేగాకుడా బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని శివసేన, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి 2019లో బీజేపీతో పోరాడుదామని చంద్రబాబుకు థాక్రే వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ వ్యవహారంపై నిశితంగా పరిశీలించుకుని తన నిర్ణయాన్ని చెప్తానని ఉద్ధవ్ థ్రాకేతో బాబు వెల్లడించినట్లు సమాచారం. 1990 నుంచి బీజేపీ-శివసేన మధ్య ఏదో రకంగా పొత్తు కొనసాగుతూనే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా ఉద్దవ్ థాక్రే తేల్చిచెప్పేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments