Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి మంది ప్రాణాలు కాపాడిన ఐపీఎస్... సీఎం జగన్ బంపర్ ఆఫర్

Webdunia
సోమవారం, 11 మే 2020 (14:31 IST)
విశాఖపట్టణం జిల్లా శివారు ప్రాంతమైన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఇటీవల విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా, ఈ విషవాయువు ఐదు గ్రామాలకు వ్యాపించింది. దీంతో ఈ గ్రామాల ప్రజలందరినీ ఖాళీ చేయించారు. 
 
అయితే, ఈ దుర్ఘటన వేకువజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం జోన్-2 డీసీపీ బిల్లా ఉదయ్ భాస్కర్ వెంటనే ఇతర పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైరన్ మోగించుకుంటా గ్రామాల్లో చక్కర్లు కొట్టాలని ఆదేశించారు. డీసీపీ ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు గ్రామాల్లో తిరుగుతా గాఢనిద్రలో ఉన్న ప్రజలు నిద్ర లేచేలా చేశాయి. 
 
ఆ వెంటనే వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు మైకుల్లో ప్రకటన చేస్తూ ముందుకుసాగారు. డీసీపీ ఉదయ భాస్కర్ తీసుకున్న చొరవ వల్ల, ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్ల సుమారు వెయ్యి మంది ప్రజలు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి చేరింది. వెంటనే డీసీపీ ఉదయ భాస్కర్‌ను అభినందిస్తూ, ఆయన పేరును ప్రతిష్టాత్మక భావించే ప్రెసిడెంట్ మెడల్‌కు సిఫార్సు చేయాల్సిందిగా డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments