Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి మంది ప్రాణాలు కాపాడిన ఐపీఎస్... సీఎం జగన్ బంపర్ ఆఫర్

Webdunia
సోమవారం, 11 మే 2020 (14:31 IST)
విశాఖపట్టణం జిల్లా శివారు ప్రాంతమైన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఇటీవల విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా, ఈ విషవాయువు ఐదు గ్రామాలకు వ్యాపించింది. దీంతో ఈ గ్రామాల ప్రజలందరినీ ఖాళీ చేయించారు. 
 
అయితే, ఈ దుర్ఘటన వేకువజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం జోన్-2 డీసీపీ బిల్లా ఉదయ్ భాస్కర్ వెంటనే ఇతర పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైరన్ మోగించుకుంటా గ్రామాల్లో చక్కర్లు కొట్టాలని ఆదేశించారు. డీసీపీ ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు గ్రామాల్లో తిరుగుతా గాఢనిద్రలో ఉన్న ప్రజలు నిద్ర లేచేలా చేశాయి. 
 
ఆ వెంటనే వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు మైకుల్లో ప్రకటన చేస్తూ ముందుకుసాగారు. డీసీపీ ఉదయ భాస్కర్ తీసుకున్న చొరవ వల్ల, ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్ల సుమారు వెయ్యి మంది ప్రజలు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి చేరింది. వెంటనే డీసీపీ ఉదయ భాస్కర్‌ను అభినందిస్తూ, ఆయన పేరును ప్రతిష్టాత్మక భావించే ప్రెసిడెంట్ మెడల్‌కు సిఫార్సు చేయాల్సిందిగా డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments