Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (05:50 IST)
వైసీపీ పాలనలో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందని టీడీపీ పోలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఆరోపించారు. జగన్​ సర్కారు వైఫల్యం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని అన్నారు.

పోలవరం, పీపీఏలు వంటి విషయాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని టీడీపీ పోలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. అమరావతిలో జరిగిన పోలిట్​బ్యూరో సమావేశం వివరాలు వెల్లడించిన ఆయన... ప్రధానంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించినట్లు వివరించారు.

గత ఐదు నెలల్లో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందని అన్నారు. కియా కార్ల పరిశ్రమను స్థానిక ఎంపీ బెదిరించారని ఆరోపించారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నీటి పంపకాలపై రాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎగువ రాష్ట్రాల ఒక్క టీఎంసీ ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్​, కేసీఆర్​ స్నేహం వారి వ్యక్తిగతమన్న ఆయన ఏపీ జలాలు తెలంగాణ భూముల్లోకి పంపడంపై పునరాలోచించాలని సూచించారు. పోలవరం, పీపీఏలు ఇలా అన్నింటిలో కేంద్రంతో ఘర్షణ వైఖరి నెలకొందని ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments