Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ, కాకినాడ తీరంలో భారత్-అమెరికా సైనిక విన్యాసాలు

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (18:36 IST)
అరుదైన సైనిక విన్యాసాలకు విశాఖ, కాకినాడ సాగర తీరం వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోని సాగర జలాల్లో.. అమెరికా, భారత్‌‌లు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఈ విన్యాసాలు 8 రోజుల పాటు కొనసాగనున్నాయి. విశాఖలోని తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ, కాకినాడ తీరాల్లో విన్యాసాలు నిర్వహించనున్నారు.

500 మంది అమెరికన్‌ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది ఈ విన్యాసాల్లో భాగస్వాములుకానున్నారు. అలాగే భారత్‌, యూఎస్‌ఎస్‌ జర్మన్‌ టౌన్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనున్నాయి.
 
‘టైగర్‌ ట్రయాంఫ్‌’పేరుతో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విన్యాసాలను ఇండో, పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఉపయోగపడతాయని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచ దేశాలకు సవాల్ విసరుతున్న ఉగ్రవాదాన్ని అణిచివసేందుకు, టెర్రరిస్టులను హెచ్చరిస్తూ.. ఇండో, అమెరికా ఆయుధ సంపత్తి ద్వారా సత్తా చాటేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇంతకు ముందే భారత్, అమెరికాలు సంయుక్తంగా వివిధ దేశాలతో కలిసి యూఎస్‌–ఏషియన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments