Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన దుర్గమ్మ హుండీ ఆదాయం

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:23 IST)
కృష్ణా జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని  ఆలయ అధికారులు లెక్కించారు . సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి పైన మహామండపం 6 వ ఫ్లోర్ లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు నిర్వహించారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు  కనుగుల వెంకటరమణ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు బ్యాంకు సిబ్బంది పర్యవేక్షించారు.
 
గడచిన ఆరు రోజులకు మొత్తం 36 హుండీలను లెక్కించగా రూ. 1,06,84,953 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ చెప్పారు.
 
హుండీల ద్వారా  30 గ్రాముల బంగారం, 2 కేజీల 438 గ్రాముల వెండి అమ్మవారికి భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. గడచిన 6 రోజులలో సగటున రోజుకు రూ.17.80 లక్షల చొప్పున దేవస్థానానికి హుండీల ద్వారా ఆదాయం చేకూరింది.

ఈ నెల 7వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఆలయ హుండీ లెక్కింపుని నిర్వహించారు. మరోవైపు ఇంద్ర కీలాద్రి దసర నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments