Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఐ.టి. కలకలం... సక్కు గ్రూపు సంస్థలపై దాడులు..

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (10:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో మాటు ఐ.టి. దాడులు క‌ల‌క‌లం రేపాయి. గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సక్కు గ్రూపు సంస్థలపై ఐటీ దాడులు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 23 ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
 
 
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలలో కోడి గుడ్ల వ్యాపారంలో సక్కు గ్రూప్స్ ఇటీవల కాలంలో మంచి పేరొందింది. దీనితోపాటు మిర్చి ఎగుమ‌తులు, స్పిన్నింగ్ వ్యాపారాల‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ వ్యాపార లావాదేవీల‌పై ఐ.టి. అధికారులు చెక్ పెట్టారు. ముఖ్యంగా గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ బ్రాంచ్ లో ఉదయం నుండి దాదాపు 50 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఆఫీసు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. లోపల ఉన్న వారిని కూడా బయటకి రానివ్వడం లేదు. వారి మొబైల్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 
వందల కోట్ల కు సంబంధించిన లావాదేవీలకు సరైన టాక్స్ చెల్లించడం లేదని వచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. అయితే, అక్ర‌మ వ్యాపారాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్‌ సినీ కెరీర్‌లో ఆఖరి సినిమా దళపతి 69 పూజతో ప్రారంభం

నటీనటులను డ్రగ్స్‌లో కేటీఆర్ ఇరికించారు, వాళ్ల ఫోన్లు ట్యాప్: నట్టి కుమార్

మోక్షజ్ఞ తొలి సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments