Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో ప్రత్యక్షంగా నామినేషన్‌ వేయలేదు.. ప్రచారం చేయనూ లేదు.. అదెలా సాధ్యం?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:02 IST)
సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో అసెంబ్లీ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా బరిలో నిలిచిన అభ్యర్థులు.. తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జనంలోకి చొచ్చుకెళ్తారు. కానీ, ఇక్కడ దానికి అంతా విరుద్ధం. ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యక్షంగా నామినేషన్‌లు వేయలేదు, అలాగే ప్రచారం కూడా చేయలేదు. 
 
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో బిజీగా ఉన్న చంద్రబాబు.. తన నియోజకవర్గంలో మాత్రం ప్రచారం చేసింది లేదు. నామినేషన్ కూడా చంద్రబాబు తరపున స్థానిక టీడీపీ నేతలే వేయడం గమనార్హం. లోకల్ లీడర్లే ప్రచారం చేస్తుండగా.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎప్పటికప్పుడు ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
 
మరోవైపు చంద్రబాబుకు ప్రధాన పోటీదారుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి కూడా నామినేషన్ దాఖలు సహా ప్రచారానికి దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా గొంతు సంబంధిత చికిత్స కోసం హైదరాబాద్‌లో ఉన్నారు చంద్రమౌళి. దీంతో చంద్రమౌళి తరపున ఆయన కుమారుడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రచారాన్ని కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నారు. 
 
ఓవైపు బిజీగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి దూరమైతే.. మరోవైపు అనారోగ్య కారణాలతో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments