Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ చీఫ్‌ అమిత్ షా సభకు జనాలు కరువు

బీజేపీ చీఫ్‌ అమిత్ షా సభకు జనాలు కరువు
, శనివారం, 30 మార్చి 2019 (13:29 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, బీజీపీ చీఫ్ అమిత్ షా‌లు దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. అలాగే, మిగిలిన అగ్రనేతలు కూడా క్షణం తీరిక లేకుండా ప్రచారంలో ఉన్నారు. 
 
అయితే, బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన శనివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. 
 
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అమిత్ షా పాల్గొనే సభకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రసంగం వినేందుకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అంటూ సుహానా ఖురేషీ అనే నెటిజన్ వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి