Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ నేతలపై అక్రమ కేసులు: చంద్రబాబు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:36 IST)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరుతూ.. ఏపీ ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

లేఖలో.. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మిట్టపల్లి గ్రామ పంచాయతీలో వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని చెప్పారు.

మరో టిడిపి నాయకుడు మనోహర్‌ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని, కేసులు పెట్టడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరించేలా చేయాలని, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైసిపి నేతలు గందరగోళం నెలకొల్పుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments