Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)

అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:04 IST)
అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగళం సమీపంలో పడేసి వెళ్ళిపోయాడు. సుమారు రెండు సంవత్సరాల పాటు పోలీసులు కేసును ఛేదించి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. 
 
నెల్లూరు జిల్లా కావలిలో చంద్రమౌళి, ఉమాదేవి భార్యాభర్తలు ఉన్నారు. వీరికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే పాప తనకు పుట్టలేదని, అక్రమ సంబంధం ద్వారానే పుట్టిందని అనుమానం పెంచుకున్న చంద్రమౌళి భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 2015 మార్చి 21వ తేదీన ఉమాదేవిని తిరుపతికి తీసుకొచ్చి మంగళం రోడ్డులో చంపి పడేసి వెళ్ళిపోయాడు. మృతురాలి ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు చంద్రమౌళి. 
 
అలాగే చిన్నపాపను కలకత్తా రైలులో వైజాగ్ వరకు తీసుకెళ్ళి వదిలి వచ్చేశాడు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు రెండు సంవత్సరాలుగా కేసును దర్యాప్తు చేస్తూనే వున్నారు. అయితే తాజాగా కావలిలో ఒక మహిళ మిస్సింగ్ కేసు రావడంతో ఆ కేసును ఆధారంగా చేసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే హత్యకు కారకుడైన నిందితులు చంద్రమౌళితో పాటు అతని స్నేహితులు మాలకొండయ్య, వెంకట రాజేష్‌ కుమార్‌ను తిరుపతిలోని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో వదిలేసిన పాప ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments