Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మద్యం కొనాలంటే అది తప్పనిసరి..?

Webdunia
శనివారం, 25 జులై 2020 (21:20 IST)
తిరుపతిలో మద్యం కొనేందుకు వెళుతున్నారా..? అయితే గొడుగు తప్పనిసరి. మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఉంటే సరిపోతుంది. గొడుగు ఎందుకు అనుకుంటున్నారా..? మద్యం కొనేందుకు మందుబాబులు వైన్ షాప్‌లకు చేరుకుని గుంపులు గుంపులుగా తోసుకుంటూ ఉండడంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి
 
దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గొడుగుతో పాటు మాస్కు ధరించి వస్తేనే మద్యం బాటిళ్ళను అందిస్తున్నారు. లేకుంటే నిర్థాక్షిణ్యంగా పక్కకు పంపించేస్తున్నారు. సాధారణంగా వర్షం పడితేనో లేకుంటే ఎండ ఎక్కువగా ఉంటే గొడుగు వాడుతుంటాం.. అలాంటిది గొడుగు తప్పనసరి చేయడంతో మందుబాబులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
 
దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది గొడుగుల బిజినెస్‌కు తెరతీశారు. వైన్ షాపుల పక్కనే గొడుగులను అద్దెకు ఇస్తున్నారు. 20 నుంచి 30 రూపాయలను ఒక గొడుగుకు వసూలు చేస్తున్నారు. చేసేదేమీ లేక మందుబాబులు గొడుగులను అద్దెకు తీసుకుని క్యూలైన్లలో నిలబడి మద్యం కొంటున్నారు.
 
తిరుపతిలో నగరంలో విపరీతంగా కేసులు పెరిగిపోతుండడం.. అది కూడా సామాజిక దూరాన్ని జనం గాలికొదిలేశారని.. వైన్ షాపుల కారణంగా కూడా కేసులు పెరిగేందుకు ఆస్కారం ఉందని ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గొడుగు వేసుకుని నిలబడితే సామాజిక దూరం ఖచ్చితంగా ఉంటుందన్నది అధికారుల ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments