సీఎం జగన్ పైన సినిమా తీస్తే బొమ్మ 1000 రోజులు ఆడుతుంది, ఎవరు?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (20:47 IST)
ఏదో ఒకటి ఎప్పుడూ మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టాలనో లేకుంటే మరేమిటో తెలియదు కానీ మొత్తం మీద అడ్డంగా బుక్కయ్యారు ఉపముఖ్యమంత్రి.

 
ఈసారి సినీప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. సినిమా హీరోలు స్వార్థం చూసుకుంటారు. వారి స్వార్థం కారణంగా ఎంతోమంది నష్టపోతుంటారు. కోట్లాదిరూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా అంటూ ప్రశ్నించారు నారాయణస్వామి. 

 
సినీ నిర్మాతలు నష్టపోతే హీరోలెప్పుడైనా ఆదుకున్నారా అంటూ ప్రశ్నించారు. భీమ్లా నాయక్ సినిమాను పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వారు మాత్రమే చూశారని, ఆ వర్గం వారు చూడటంతోనే మూడురోజుల పాటు సినిమా హౌస్ ఫుల్ అయ్యిందన్నారు.

 
అసలు సిఎం జగన్ పేదల పాలిట నిజమైన హీరో అన్నారు. సిఎం జగన్ పైన సినిమా తీస్తే బొమ్మ వెయ్యిరోజులు ఆడుతుందన్నారు డిప్యూటీ సిఎం నారాయణస్వామి. తెలిసీ తెలియకుండా జనసైనికులు నోరు పారేసుకోవద్దని హితవు పలికారు నారాయణస్వామి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments