Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింపుల్ చాలెంజ్... వాళ్ల అభ్యర్థి ఓడితే రోజా అది చేయించుకుంటే చాలు... బోండా(వీడియో)

వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (17:43 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రోజాకు బహిరంగ సవాల్ విసురుతున్నానన్నారు బోండా ఉమ. 
 
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఓడిపోతే నంద్యాలలోని నడిరోడ్డుపై గుండు గీయించుకోవడానికి తాను సిద్థంగా ఉన్నానని, అదే వైసిపి అభ్యర్థి ఓడిపోతే గుండు గీయించుకోవడానికి రోజా సిద్ధంగా ఉన్నారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు బోండా ఉమ. పెద్దపెద్ద మాటలు వద్దనీ, ఇదో సింపుల్ చాలెంజ్ అనీ, పార్టీ కార్యాలయాలు మూసుకోవడం, రాజకీయ సన్యాసాలు చేసుకోవడం అంతా వద్దనీ... ఎవరి పార్టీ అభ్యర్థి ఓడితే వాళ్లు గుండు కొట్టించుకుంటే చాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఓడితే తను గుండు గీయించుకోవడానికి సిద్ధమనీ, రోజా కూడా తన సవాలును తీసుకుంటారా అని ప్రశ్నించారు.
 
బోండా ఉమ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై రోజా గాని, ఆ పార్టీ నేతలు గాని అస్సలు స్పందించడం లేదు. కాగా నేటితో నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments