Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్ మూలాల వేట కోసం నరసారావు పేటకు వచ్చిన ఐటీ - ఐటీ బృందాలు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (16:10 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాకాండకు మూలాలు గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చే వేధింగా ఇక్కడ సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అకాడెమీలో తనిఖీల కోసం నరసారావుపేటకు ఐటీ, ఐబీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా నరసారావు పేటలో ఉన్న సాయి డిఫెన్స్ అకాడెమీలో వారు తనిఖీలు చేశారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసారావుపేట కేంద్రమని పోలీసులు తేల్చారు. దంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇక్కడకు చేరుకుని పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వెళ్లారు. 
 
అక్కడ వారు అకాడెమీ రికార్డులను నిశితంగా పరిశీలించారు. అకాడెమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా అకాడెమీలో పని చేసే సిబ్బందిని కూడా ఐటీ, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments