Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎఎస్, ఐపిఎస్‌లు రైతులుగా మారి పొలంలోకి దిగి..?

IAS
Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (22:56 IST)
వృత్తిరీత్యా ఒకరు జిల్లాస్థాయి అధికారి.. ఇద్దరు అర్బన్ జిల్లా ఉన్నతాధికారులు. వృత్తిని మర్చిపోయారు. రైతులను చూసి వెంటనే పొలంలోకి దిగారు. పొలంలో వరినాట్లు వేశారు. ఐఎఎస్, ఐపిఎస్ స్థాయిని మరిచి వరి నాట్లు వేశారు. తాము రైతు బిడ్డలమని నిరూపించుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఒకరేమో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్త, మరొకరేమో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. ఇంకొకరు తిరుపతి నగర పాలకసంస్థ కమిషనర్ గిరీషా.. వీరు ముగ్గురు ఐఎఎస్, ఐపిఎస్ చేసిన వారే. తమ పరిపాలనతో అందరి మన్ననలను పొందుతున్నారు. అయితే వీరు ముగ్గురు ఒకేచోట కలిశారు. 
 
తిరుపతికి సమీపంలోని ఒక పొలంలో దిగారు ముగ్గురు. వృత్తిని పక్కనబెట్టి వరినాట్లు నాటారు. ఆనందంగా ముగ్గురు గంటపాటు పొలంలోనే గడిపారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వీరు రావడంతో పాతజ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఉన్నతాధికారులు పొలంలో దిగి పనులు చేయడం చూసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments