Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా... కిషన్ రెడ్డీ... ప్లీజ్ ప్లీజ్ అని ఏపీ సీఎం జగన్ అంటే...?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (18:39 IST)
కమలదళం తెలంగాణంలో మెల్లమెల్లగా పాగా వేస్తోంది. అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలిచి గులాబీ బాస్ కేసీఆర్‌కి షాకిచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించి ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రిగా కీలక పదవిని కట్టబెట్టడం ద్వారా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్లు అర్థమవుతోంది. 
 
ఇదిలావుంటే కొత్తగా కేంద్ర మంత్రిగా ఎంపికైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హోంమంత్రి అమిత్ షాతో కలిసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా చాలా సంతోషంగా వున్నదని వెల్లడించారు.

ఏపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం లేదు కనుక ఆ రాష్ట్రాన్ని చూసుకునే బాధ్యతను కూడా తనకే అప్పగించారని... ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... అన్నా కిషన్ రెడ్డి ప్లీజ్ అని ప్రత్యేక హోదా కోసం అడిగితే సరిపోతుందేమో?

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments