Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చిత్రహింసలు పెట్టారు, తిరుపతిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (21:07 IST)
నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. క్షణక్షణం ఉత్కంఠ మధ్య ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బిజెపి అభ్యర్థే చివరకు విజయం సాధించారు. అయితే తన విజయం తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. 
 
తనపై అక్రమ కేసులు పెట్టి ఓడించాలని టిఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని చెప్పారు రఘునందన్ రావు. ఒక సామాన్య వ్యక్తి గెలుస్తాడా అని నన్ను ఎగతాళిగా మాట్లాడారని, కానీ తెలంగాణా చరిత్రలోనే ఇది ఒక భారీ విజయమని సంతోషం వ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే.
 
ఈ విజయం ప్రజలదేనన్న రఘునందన్ రావు నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలతోనే తన విజయం సాధ్యమైందన్నారు. గ్రామీణ ప్రాంతమైన దుబ్బాక ప్రజలు బిజెపిపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు.
 
దుబ్బాక ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. ప్రజా సేవలకు అంకితమవుతానన్నారు. టిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నమ్మకం పోయిందన్న రఘునందన్ రావు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలం బాగా పెరుగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments