నాకు దేశంలో ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు ఉంది: ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:40 IST)
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రెడ్ జోన్ లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చిన కారణంగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి అధికారులు హోం క్వారంటైన్ నోటీసులు ఇచ్చారనే వార్తుల వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వార్తలపై ఆయన స్పందించారు. స్థానిక సీఐ, ఎస్సైలకు తెలియకే తన ఇంటికి నోటీసులు అతికించారని అన్నారు.

వ్యక్తిగతంగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు కేంద్ర సహాయ మంత్రి హోదా ఉంటుందని.. దేశంలో ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. వీటిపై అవగాహన లేని వ్యక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
 
తనకు 24 గంటల పాటు సెక్యూరిటీ ఉంటుందని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు భద్రతను కల్పిస్తాయని విష్ణు తెలిపారు. అధికార పార్టీ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులను క్వారంటైన్లో పెడతారా? అని ప్రశ్నించారు. సమాజసేవ చేయాల్సిన వారికి సహకరించాల్సిన అవసరం ఉందని... బీజేపీ నేతలపై అధికార పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments