Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూర్ఛ రోగంతో మహిళ మృతి... చనిపోయిందని తెలియక తల్లి శవంపై నిద్రపోయిన చిన్నారి!

హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయవిదారక దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ఇది చూపరులను కంటతడిపెట్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్ల

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (13:45 IST)
హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయవిదారక దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ఇది చూపరులను కంటతడిపెట్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది. స్టేషన్‌కు వచ్చాక ఆమెకు మూర్ఛ వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ స్టేషన్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.
 
అయితే ఆమెతో ఉన్న చంటిబిడ్డకు ఈ విషయం తెలియక... తల్లిపాల కోసం మారాం చేశాడు. ఎంత పిలిచినా తల్లి లేవకపోవడంతో కాసేపు అలిగాడు. ఆ తర్వాత మళ్లీ తల్లి చెంతకు చేరి ఏడుపులంకించుకున్నాడు. తల్లిపాలు తాగే ప్రయత్నం చేసి, కన్నీళ్లింకిపోయి చివరకు తల్లి శవంపై ఆదమరచి నిద్రపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో చూపరుల కంట నీరుతెప్పించింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చంటిబిడ్డను ఆస్పత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments