Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బాలుడు మృతి

Hyderabad
Webdunia
గురువారం, 14 మార్చి 2019 (13:57 IST)
స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంజపూర్‌లో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న బాలుడిని గురువారం ఉదయం కమ్మగూడా లోటస్ లాప్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా వెళ్లిపోయాడు.
 
బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు, బంధువులు మృతం దేహాన్ని స్కూలు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా స్కూలు యాజమాన్యం స్కూలు గేటుకు తాళం వేసి, షట్టర్ మూసివేసి స్కూలును నడుపుతున్నారు. ఈ ఘటన గురించి, వారు చేస్తున్న ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments