Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం వచ్చిన మహిళను ఎస్ఐ ఏం చేశాడంటే...

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె భర్తకే వార్నింగ్ ఇచ్చాడు.

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (09:55 IST)
తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె భర్తకే వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విషయం సీరియస్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండే ఓ వివాహిత... తన భర్తపై కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వచ్చింది. అయితే... ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్సై నర్సింహ ఆ మహిళతో మాటామంతీ కలిసి చివరకు ఆమెను ట్రాప్ చేశాడు. అనంతరం వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగసాగారు. 
 
ఆ తర్వాత ఆ మహిళను తన వశం చేసుకునేందుకు ఆ మహిళ భర్తకు ఎస్సై ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న భర్త సతీష్ ఈ విషయాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళాడు. ఎస్సై నర్సింహ తనను బెదిరిస్తున్నాడని, ఆయన బారి నుంచి కాపాడాలని మొరపెట్టుకున్నాడు. దీంతో డీసీపీ ఈ వ్యవహారంపై ఆరా తీసి అసలు విషయం తెలుసుకుని గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆ ఎస్సైపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments