Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్... ఉపాధ్యాయురాలితో రెండో పెళ్లి

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (13:54 IST)
ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్.. ఓ ఉపాధ్యాయురాలిపై మనసుపడ్డాడు. తొలి భార్యకు తెలియకుండా ఉపాధ్యాయురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి చేసి ప్రిన్సిపాన్‌ను చితకబాదారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్‌లో జరిగిందీ ఘటన.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హబీబ్ ఫాతిమా నగర్‌కు చెందిన అయూబ్ అలీ (42) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. భార్యకూడా ఉంది.
 
అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి(23)తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె వద్ద తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి, మాటలతో మభ్యపెట్టి ఎవరికీ తెలియకుండా రెండో పెళ్ళి చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలపై శనివారం దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఫర్నిచర్, కంప్యూటర్, పూలకుండీలు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయూబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments