Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం భార్యనే కిడ్నాప్ చేసిన ప్రబుద్ధుడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:27 IST)
ఆధునికత మారినా.. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. లోకం తీరు మారిపోతున్నా.. మనిషి బుద్ధిలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కట్నం కోసం వేధించడం, మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అదనపు కట్నం కోసం ఓ భర్త భార్యనే కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. హైదరాబాదులోనే చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మాసబ్ ట్యాంకు ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్ (74) అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేసిన షరీఫ్... తన ఆస్తులు ఇద్దరు కుమార్తెలకు చెందుతాయని పెళ్లి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
2014లో రెండో కుమార్తె అస్మాను సల్మాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంత కాలం భార్యతో బాగానే గడిపిన సల్మాన్... ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వచ్చింది.
 
ఇలా తండ్రితో కలిసి ఆస్పత్రికి వెళ్తుండగా భార్యనే భర్త సల్మాన్ కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో కూతురును కాపాడేందుకు యత్నించిన షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments