Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లీల పేరుతో రూ.100 కోట్లు నొక్కేశాడు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (14:01 IST)
ఓ వ్యక్తి పల్లీల పేరుతో ఏకంగా వంద కోట్ల రూపాయలు స్వాహా చేశారు. తామిచ్చిన పల్లీలు తీసుకుని, నూనె తీసిస్తే లక్షాధికారులు కావొచ్చంటూ ప్రజలను గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ జిన్నా కాంతయ్య అలియాస్ జిన్నా శ్రీకాంత్ రెడ్డి మోసం చేశారని హైదరాబాద్ నగర సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మోసం ఉప్పల్ కేంద్రంగా నడిచిన దందా నడించిందన్నారు. కేవలం ఇంటర్ వరకూ చదువుకుని, ముంబైలోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో కొంతకాలం పనిచేశాడని వివరించారు.
 
1991 ప్రాంతంలో హైదరాబాద్‌ నగరానికి వచ్చిన శ్రీకాంత్ సొంత వ్యాపారం ప్రారంభించి కోల్‌కతాకు చెందిన మితా బిశ్వాన్‌ను వివాహం చేసుకున్నట్టు చెప్పారు. తొలుత సిగ్మా గ్రాఫిక్స్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్, నిజామాబాద్‌లో స్టాపర్స్ వరల్డ్ పేరిట అగరు బత్తీల తయారీ వంటి వ్యాపారాలు చేశాడని తెలిపారు. 
 
అంతేకాకుండా, అగర్ బత్తీల్లో యువకులకు శిక్షణ ఇస్తామని చెప్పి... నిరుద్యోగుల నుంచి రూ.75 వేల చొప్పున వసూలు చేశాడని వివరించాడు. ఆయన చేస్తున్న మోసంపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో నిఘా పెరిగింది. ఈ క్రమంలో మహాలైఫ్ ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నిర్మాణ రంగంలోకి ప్రవేశించి... తన కంపెనీలో మానవ వనరుల విభాగం మేనేజర్‌గా చేరిన అహల్యా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. 
 
ఆపై కర్నూలులో రియల్ దందా ప్రారంభించి, రూ.150 కోట్లతో 350 ఎకరాల స్థలం కొనుగోలుకు ప్లాన్ వేశాడని, ఆపై గ్రీన్ గోల్డ్ బయోటెక్‌ను ప్రారంభించి మోసాలకు తెరలేపాడని చెప్పారు. పల్లీలు ఇచ్చి నూనె తీసిస్తే రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి... రూ.100 కోట్లకు పైగా స్వాహా చేశాడని తెలిపారు. ఈయనపై హైదరాబాద్, కడప, వరంగల్‌ నగరాల్లో పలు కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments