Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నేమో బిర్యానీలో గొంగలి పురుగు.. నిన్నేమో చాక్లెట్‌ కేక్‌లో బొద్దింక

హైదరాబాద్ నగరంలోని ఐకియా రెస్టారెంట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఐకియా రెస్టారెంట్ బిర్యానీలో గొంగలి పురుగు బయటపడింది. ఈ ఘటనపై అప్పట్లో కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:12 IST)
హైదరాబాద్ నగరంలోని ఐకియా రెస్టారెంట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఐకియా రెస్టారెంట్ బిర్యానీలో గొంగలి పురుగు బయటపడింది. ఈ ఘటనపై అప్పట్లో కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా ఇదే ఐకియా రెస్టారెంట్లో చాక్లెట్ కేక్ ఆర్డర్ చేస్తే బొద్దింక పాకుతూ కనిపించింది. ఓ కస్టమర్‌ ఐకియాలోని రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ చాక్లెట్ కేస్ ఆర్డర్ చేశాడు. అందులో బొద్దింక కనిపించింది. వెంటనే దానిని ఫోటో తీసి ఆ కస్టమర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ఐకియా స్టోర్‌కి చేరుకొని పరీక్షలు చేశారు. ఆ చాక్లెట్ కేకు సంబంధించిన కొన్ని శాంపిల్స్ సేకరించారు.
 
అంతేకాకుండా సంస్థకి రూ.5వేల జరిమానా కూడా విధించారు. శాంపిల్స్‌ని పరిశీలించి కంపెనీపై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఐకియా స్టార్ ప్రారంభించిన రెండు నెలల్లోపే ఫుడ్ క్వాలిటీ లేదని వార్తల్లో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments