Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుకు రాకూడదు.. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాకు.. హైకోర్టు ఆగ్రహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి వుందని చెప్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహా

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (09:50 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి వుందని చెప్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన నేపథ్యంలో.. కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకే జగన్ ఇలాంటి పాదయాత్రల సాకు చెప్తున్నట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
మినహాయింపును కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం నాడు రాలేకపోతే, అందుకు కారణాలను వెల్లడిస్తూ, కింది కోర్టులోనే అనుమతి పొందవచ్చని.. అది ఆ కోర్టు విచక్షణపైనే ఆధారపడి వుంటుందని హైకోర్టు తేల్చి చెప్పేసింది. నాలుగేళ్ల తర్వాత పాదయాత్ర అనే కారణంతో పిటిషన్ సమర్పించడం వెనుక కోర్టుకు హాజరు కాకూడదనే ఆలోచన వుందేమోనని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.  
 
నేర తీవ్రత తక్కువగా వుంటే పర్లేదు కానీ.. ఎక్కువకాలం శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఇలాంటి సౌలభ్యాలు లభించవని న్యాయమూర్తి .సత్యనారాయణమూర్తి తీర్పిచ్చారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ తరహా కేసుల్లో నిందితులకు మినహాయింపులుండవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments