Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కుమార్తె రేప్ చేసిన వ్యక్తి హత్య కేసు... లొంగిపోయిన తండ్రి

తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మృతురాలి తండ్రి కోర్టులో లొంగిపోయాడు. ఆయన పేరు శ్యాంసుందర్ రెడ్డి. హైదరాబాద్ శివార్లల

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:57 IST)
తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మృతురాలి తండ్రి కోర్టులో లొంగిపోయాడు. ఆయన పేరు శ్యాంసుందర్ రెడ్డి. హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్‌లో గత నెల 27వ తేదీన ఈ దారుణం జరిగింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే, రాజేష్ హత్య అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన శ్యాంసుందర్ ఆపై ఆధిబట్ల పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
ఓ గుడికి చైర్మన్‌గా ఉన్న రాజేష్, భూదందాలు, రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, అత్యాచారాలు, బెదిరింపులకు అలవాటు పడ్డాడని, అతనికి బతికే హక్కు లేదని చెప్పాడు. అతన్ని తాను చంపలేదని, తనపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి లొంగిపోయేందుకు వచ్చానని తెలిపాడు. 
 
తన కుమార్తెకు మత్తుమందిచ్చి, ఆపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడని చెప్పాడు. దాన్ని యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తూ, మానసిక హింసకు గురిచేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వివరించాడు. రాజేష్ హత్యను ఎవరు చేశారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments