Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాంతాన్ని ఎంజాయ్ చేయొద్దంటే ఎలా? మందెక్కువై నడిరోడ్డుపై యువతుల హల్‌చల్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (15:10 IST)
హైదరాబాద్ రోడ్లపై అమ్మాయిలు హల్ చల్ సృష్టించారు. పీకల వరకు మద్యం సేవించి యువతులు బాహాబాహీగా తలపడ్డారు. దీన్ని చూసిన పోలీసులు విస్తుపోయారు. దీనిపై పోలీసులు యువతులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన యువతులు.. వారంతాన్ని కూడా ఎంజాయ్ చేయొద్దంటూ ఎలా? అంటూ నిలదీయడంతో పోలీసులు ఖంగుతిన్నారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన కొంతమంది అమ్మాయిలు జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్‌లో పూటుగా మందు కొట్టారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో... రోడ్డుపై బాహాబాహీకి దిగారు. పొట్టిపొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే, అక్కడ వందలాది మంది పోగయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వద్ద జరిగింది.
 
ఇప్పటికే హైదరాబాద్‌లోని పబ్‌ల వద్ద న్యూసెన్స్ పెరిగిపోయిందని, వారాంతం వస్తే గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న వేళ, వాటిని నిజం చేసిన ఘటన ఇది. ఓ అమ్మాయి తన చివరి పెగ్‌గా చెప్పుకున్న మద్యాన్ని మరో అమ్మాయి తాగడమే మొత్తం గొడవకు కారణమని సమాచారం. రోడ్డుపై అమ్మాయిలు గొడవ పడుతుంటే, తెలుసుకుని వచ్చిన ట్రాఫిక్ పోలీసులు, వారిని అదుపు చేసేందుకు మహిళా పోలీసులు లేక, తలపట్టుకోవాల్సి వచ్చింది. చివరకు లేడీ కానిస్టేబుళ్లను పిలిపించి, వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments