Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ఆపై సోషల్ మీడియాలో వైరల్ చేశారు..

Webdunia
బుధవారం, 15 జులై 2020 (13:36 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు, హింసలు, ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొందరు యువకులు ఓ బాలిక ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి.. ఆ బాలిక పేరు మీదనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాను క్రియేట్ చేశారు.

మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా డబ్బులిస్తేనే వాటిని తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాలిక తండ్రి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బాలిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలిక ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. ఈ క్రమంలోనే జూన్ 27న సాయంత్రం వాట్సాప్‌లో మార్ఫింగ్ చేసిన బాలిక ఫొటోలను పంపించారు. బాలిక పేరుతోనే ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను తెరిచారు.
 
అందులో మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. బాలిక తండ్రి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలను తొలగించాలంటే డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని.. బాలిక తండ్రి పోలీసులకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments