Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ఆపై సోషల్ మీడియాలో వైరల్ చేశారు..

Webdunia
బుధవారం, 15 జులై 2020 (13:36 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు, హింసలు, ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొందరు యువకులు ఓ బాలిక ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి.. ఆ బాలిక పేరు మీదనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాను క్రియేట్ చేశారు.

మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా డబ్బులిస్తేనే వాటిని తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాలిక తండ్రి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బాలిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలిక ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. ఈ క్రమంలోనే జూన్ 27న సాయంత్రం వాట్సాప్‌లో మార్ఫింగ్ చేసిన బాలిక ఫొటోలను పంపించారు. బాలిక పేరుతోనే ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను తెరిచారు.
 
అందులో మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. బాలిక తండ్రి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలను తొలగించాలంటే డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని.. బాలిక తండ్రి పోలీసులకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments