Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య టిఫిన్ వండలేదని అడిగాడు.. అంతే ఫ్యానుకు ఉరేసుకుని?

Webdunia
సోమవారం, 20 మే 2019 (13:57 IST)
భార్యాభర్తల అనుబంధాలు రోజు రోజుకీ పెటాకులు అవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఉదయం పూట అల్పాహారం వండలేదని ఏర్పడిన గొడవ ఓ వివాహిత ప్రాణాలు తీసింది. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  రామరాజ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కొండపల్లి మహేష్‌కు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కశింకోట ప్రాంతానికి చెందిన నాగమణితో ఏడాదిన్నర కిందట వివాహమైంది. 
 
మహేష్‌ చిట్టినగర్‌ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో దర్జీగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ 11నెలల బాబు వున్నాడు. కానీ ఆదివారం పూట ఉదయం భార్యాభర్తల మధ్య టిఫిన్ వండే విషయమై ఘర్షణ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా నాగమణి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments