Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయంకాని వ్యాధి.. ఆర్థిక ఇబ్బందులు.. భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (13:47 IST)
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన భార్యను కట్టుకున్న భర్త చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా పొన్నురు మండలం కసుకర్రు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య (50), తుమ్మంపాటి రోజా (45) అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. 
 
అదేసమయంలో వైద్యం చేయించుకునేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేకుండాపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నసుబ్బయ్య.. భార్య రోజాను తలపై కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ దంపతులు తెల్లవారినప్పటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు నమోదు చేసిన పొన్నూరు గ్రామీణ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments