Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయంకాని వ్యాధి.. ఆర్థిక ఇబ్బందులు.. భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (13:47 IST)
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన భార్యను కట్టుకున్న భర్త చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా పొన్నురు మండలం కసుకర్రు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య (50), తుమ్మంపాటి రోజా (45) అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. 
 
అదేసమయంలో వైద్యం చేయించుకునేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేకుండాపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నసుబ్బయ్య.. భార్య రోజాను తలపై కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ దంపతులు తెల్లవారినప్పటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు నమోదు చేసిన పొన్నూరు గ్రామీణ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments