Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జోరుగా మద్యం వ్యాపారం... 3 రోజుల్లో రూ.77 కోట్ల విక్రయాలు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (11:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా మద్యం వ్యాపారం సాగుతుంది. దీనికి నిదర్శనమే గత మూడు రోజుల్లో ఏకంగా రూ.77 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలతో పాటు ప్రైవేటు మద్యం దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. వీటిలో అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. 
 
గత మూడు రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 7943 మంది వ్యాపారులు స్టాక్ తీసుకెళ్లారు. ఈ మూడు రోజుల్లోనే రెండు, మూడు సార్లు స్టాక్ తీసుకెళ్లిన వ్యాపారులు కూడా ఉన్నారంటా రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. 
 
నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 677511 కేసుల లిక్కర్ అమ్ముడుపోయింది. 194261 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. రాష్ట్రంలోని బార్లకు ఈ మూడు రోజుల్లో ఎక్సైజ్ శాఖ రూ.77 కోట్ల విలువైన అమ్మకాలు జరిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments