Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను ప్రమాదం నుంచి బయటపడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (12:48 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్న బండారు దత్తాత్రేయ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. 
 
ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
 
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. సూర్యాపేటలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్‌లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. 
 
ఈ ప్రయాణానికి ముందు గవర్నర్ దత్తాత్రేయతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసినట్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments