Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను ప్రమాదం నుంచి బయటపడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (12:48 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్న బండారు దత్తాత్రేయ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. 
 
ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
 
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. సూర్యాపేటలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్‌లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. 
 
ఈ ప్రయాణానికి ముందు గవర్నర్ దత్తాత్రేయతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసినట్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments